సీనియర్ నటుడు కృష్ణంరాజు బర్త్ డే.. బీజేపీ నేతలకు విందు!

  • గత సోమవారం 80వ పుట్టినరోజును జరుపుకున్న కృష్ణంరాజు
  • హాజరైన పలువురు సినీ ప్రముఖులు
  • పార్టీకి హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేతలకు విందు ఇచ్చారు. ఈ పార్టీకి నటుడు ప్రభాస్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరై కృష్ణంరాజుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మరోమారు కేక్ కట్ చేసిన కృష్ణంరాజు బీజేపీ నేతలకు తినిపించారు.

కృష్ణంరాజు గత సోమవారమే 80వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు నటుడు ప్రభాస్, మోహన్‌బాబు, చిరంజీవి, మంచులక్ష్మి, విష్ణు తదితరులు హాజరయ్యారు. తాజాగా, బీజేపీ నేతలతో కలిసి మరోమారు ఆయన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
Go Back to Shorts
krishnam raju
Tollywood
BJP
Birthday

More Telugu News